+91 95819 05907

కాంగ్రెస్ బాకీ కార్డును ప్రతి ఓటర్ కు అందజేస్తాం :రేగా

*మహిళకు యూరియా కట్ట ఇయ్యలేని సర్కార్ మహిళకు కోటి ఇస్తారట*
*బిఆర్ఎస్ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేస్తా జిల్లా అధ్యక్షులు రేగా*
*నేటి గదర్ న్యూస్ గుండాల*
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలో భాగంగా ఆరు గ్యారెంటీ లతోపాటు 420 హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక హామీల అమలు పరచడంలో విఫలమైందని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు విమర్శించారు. సోమవారం మండల కేంద్రంలో పార్టీ నాయకులతో సమావేశాన్ని నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బాకీపడ్డ ఆరు గ్యారెంటీల గ్యారెంటీ కార్డును ప్రతి ఓటరుకు అందజేసి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాయ మాటలు చెబుతూ కాలం వెళ్ళబుచుతుందని ఆయన అన్నారు గడిచిన 20 నెలలోనే రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుచేసి ఏ అభివృద్ధి చేశారు చూపాలని అన్నారు. గతంలో బిఆర్ఎస్ పార్టీ అమలు చేసిన ఏ సంక్షేమ పథకం ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరిగితే బాకీ పడ్డ సంక్షేమ పథకాలను ఇవ్వాలని ప్రతి ఓటరు అడగాలని అన్నారు. గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పినపాక నియోజకవర్గం కోట్ల రూపాయల నిధులను తీసుకువస్తే ప్రస్తుత ఎమ్మెల్యే వాటిని క్యాన్సిల్ చేయించారు కానీ కొత్త నిధులను రాబట్టడంలో విఫలమయ్యారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాయ మాటలు చెప్పి మళ్ళీ ఓట్లు దండుకోవడానికి చూస్తున్నారని ప్రజలు వాళ్ళ మాయమాటల్లో పడి మళ్లీ ఇబ్బందులకు గురి కావద్దని ఆయన అన్నారు. మహిళలకు యూరియా బస్తా ఇవ్వలేని ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని అనడం ఎంతో ఆశయాస్పదమని ఆయన అన్నారు. రానున్న ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, మాజీ రైతు సమన్య సమితి అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి, పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ రాము, ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్ట రాములు, యువజన విభాగం అధ్యక్షులు సయ్యద్ అజ్జు, పార్టీ సీనియర్ నాయకులు మొత్తం రవి, గడ్డం వీరన్న, ఏడూర్ల బుచ్చి రాములు, కుంజ నాగేశ్వరరావు, తాటి కృష్ణ, మల్లయ్య, జాడి ప్రభాకర్, కుంజ సుధాకర్, పొంబోయిన సుధాకర్, రామటంకి అనిల్, గొగ్గల రాంబాబు, సాయం శ్రీను, సుతారి సత్యం, సిహెచ్ వీరన్న, గంగాధరి ప్రమోద్, మొక్క ప్రశాంత్, గుగులోత్ వీరు, ఈసం సుధాకర్,బుఖ్య శ్రీను, జనగం లక్ష్మయ్య, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !