నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 15: అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ నియోజకవర్గానికి చెందిన అనారోగ్య బాధితులను హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో బుధవారం పరామర్శించారు. దమ్మపేట మండలం పట్వారిగూడెంకు చెందిన వెదర్ల కిరణ్ కుమార్ మరియు రామనగరంకు చెందిన నక్క మనీషా లను వివిధ అనారోగ్య సమస్యలతో ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ వారి ప్రస్తుత ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, చికిత్స ఖర్చుల గురించి భయపడవద్దని సూచించారు. ఎల్.ఓ.సి ద్వారా వారికి అయ్యే పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించేలా, ఉచిత ట్రీట్మెంట్ త్వరగా అందేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అండగా నిలవడంతో బాధితుల కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 50









