విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన మీ త్యాగం మరువలేనిది పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిన వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.
నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా రింగ్ రోడ్ సెంటర్ నందు వైరా డివిజన్ పోలీస్ నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా క్యాండిల్ ర్యాలీ ఈ ర్యాలీలో ముఖ్యఅతిథిగా క్యాండిల్ పట్టుకొని అమరవీరుల త్యాగాలను గుర్తుచేసిన గౌరవ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
ఈ సందర్భంగా వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ
విధి నిర్వహణలో అసువులు బారిన పోలీస్ మిత్రులకు నివాళులర్పిస్తూ ఈ దేశం కోసం ఎందరో పోలీసులు విధి నిర్వహణలో మన రక్షణ కోసం అసువులుబాసిన పోలీస్ అమరవీరులకు వైరా డివిజన్ పోలీస్ వారు వారి ఆత్మ శాంతి కోసం వారిని స్మరించుకుంటూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు దీంట్లో నేను పాలుపంచుకోవడం నాకు చాలా ఆనందాన్ని కలిగించిందని వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారు త్యాగాల ఫలితమే ఈరోజు ఈ దేశం, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆకాంక్షిస్తున్నాను.నిన్నగాక మొన్న మన రాష్ట్రంలో విధి నిర్వహణలో ప్రమోద్ అనే కానిస్టేబుల్ ఓ దుండగుడి చేతిలో హత్యకు గురికాపడ్డాడు వారి కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి. ప్రమోద్ ఆత్మకు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అమరవీరుల త్యాగాలకు జోహార్లు అని నినదించి అమరవీరుల సంస్మరణ సభలో వారిని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో వైరా సర్కిల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ సాగర్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి రామారావు, మరో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పవన్ మరియు స్టేషన్ సిబ్బంది కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ ఏఎస్ఐ లు తోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు టిపిసిసి ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు, పమ్మి అశోక్, వీరంశెట్టి సీతారాములు, వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు, లైన్స్ క్లబ్ డాక్టర్ కాపా మురళీకృష్ణ, చెరుకూరి కిరణ్, కట్ల సంతోష్, జవ్వాజి నాగరాజు, ధరావత్ శంకర్ నాయక్, షేక్ జాన్ పాషా (గన్ను), తోటకూర గోపి, తదితరర్లు పాల్గొన్నారు.









