*మతతత్వ బీజాలు నాటే నూతన విద్యా విధానాన్ని నిలుపుదల చేయాలి*
*ఏఐఎస్ఎఫ్*
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నూతనంగా పీఎం శ్రీ స్కూల్స్ ఏర్పాటు చేయడం ద్వారా నూతన విద్యా విధానం పేరుతో పసిపిల్లల మెదల్లో మతతత్వ బీజాలు నాటే ప్రయత్నం చేస్తుందని వెంటనే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు గుగులోత్ అనిల్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్థానిక జూలూరుపాడు మండల కేంద్రంలోని ఏఐఎస్ఎఫ్ నాయకులు సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ. దేశవ్యాప్తంగా 2022- 23 – నుండి 2026 – 2027 వరకు ఐదు సంవత్సరాలు కాలంలో దేశవ్యాప్తంగా పీఎం శ్రీ సుమారుగా 14,500 పాఠశాలలను నెలకొల్పాలని ప్రాథమిక విద్య నూతన విద్యా విధానం ద్వారా మతతత్వ బోధన లు చేయాలని తలపెట్టిందన్నారు ఇది అభివృద్ధి నిరోధక విధానం అన్నారు దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలానికి పీఎం శ్రీ పాఠశాల ఏర్పాటు చేయడానికి పూనుకుంటుందన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై పునరాలోచన చేయాలని ఆయన అన్నారు దేశవ్యాప్తంగా విద్యావేత్తలు ప్రగతిశీల మేధావులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం సరైనది కాదని చాలా కాలంగా నిరసన లు చేస్తున్నారన్నారు నూతన విద్యా విధానం ప్రణాళికను రద్దు చేయాలని మొదటి నుండి ఏఐఎస్ఎఫ్ పోరాటాలు నిర్వహిస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వం తక్షణమే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు సాయి తేజ, అనిల్, రామ్, చరణ్, ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు…









