మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలం, రేమిడిచర్ల గ్రామంలో 33/11 కేవీ నూతన విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.
నేటి గదర్ న్యూస్, 28/10/2025, ఎర్రుపాలెం ప్రతినిధి ; సగ్గుర్తి ముత్యాల రావు
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ
గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా స్థిరంగా ఉండేలా, రైతులకు నిరంతర విద్యుత్ అందించేందుకు, పరిశ్రమలకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
ఈ ఉపకేంద్రం నిర్మాణం పూర్తయిన తరువాత పరిసర గ్రామాలకు నిరంతర, స్థిరమైన విద్యుత్ సరఫరా లభించనుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేమిరెడ్డీ సుధాకర్ రెడ్డి, పిసిసి సభ్యులు శీలం ప్రతాప్ రెడ్డి, ఐలూరి వెంకటేష్ రెడ్డి, చావా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
★ఎర్రుపాలెం మండలం రెమిడిచర్ల గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను ప్రత్యక్షంగా పరిశీలించిన డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క మల్లు
నేటి గదర్ న్యూస్, ఎర్రుపాలెం ప్రతినిధి ; సగ్గుర్తి ముత్యా
రోడ్డు పైకి నీరు నిల్వ కాకుండా డ్రైనేజీ పైప్లైన్ను మరింత పొడిగించి, కాలువలలో ఉన్న పూడికను తక్షణమే తొలగించాలంటూ అధికారులను ఆదేశించారు.
ప్రజల సమస్యలు పరిష్కరించడమే మన ప్రభుత్వ లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నాం అని డిప్యూటీ సీఎం అన్నారు.









