మహబూబాబాద్ జిల్లాలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సాగేందుకు జిల్లా పోలీసులు అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తిచేసినట్టు జిల్లా ఎస్పీ డా. శబరీష్ అన్నారు.
ఎన్నికల సమయంలో జరిగే అక్రమ రవాణా నగదు పంపిణీ మద్యం సరఫరా వంటి చట్టవిరుద్ధ చర్యలను అరికట్టేందుకు జిల్లా సరిహద్దులో చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు.
చెక్పోస్టుల వద్ద 24 గంటలు పోలీస్ సిబ్బంది డ్యూటీలో ఉంటూ, వాహనాలు – వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. చట్టాన్ని ఉల్లంఘించే ప్రయత్నాలను ముందుగానే నిరోధించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసారన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి గస్తీలు, సర్ప్రైజ్ చెకింగ్ మరియు నిరంతర పర్యవేక్షణ ను మరింత బలపరిచినట్టు ఎస్పీ పేర్కొన్నారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు ప్రజలు పోలీసులకు పూర్తిగా సహకరించాలని, అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే 100కు కానీ సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.









