పంట అవవేశేషాలు తగలబెట్టవద్దు – ధనసరి పుల్లయ్య
నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి:
పంట అవేశేషాలు తగలపెట్టవద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య అన్నారు.ఈ సందర్భంగా పుల్లయ్య సోమవారం చింతకాని మండలం వందనం గ్రామంలో పొలంలో పర్యటించి.రైతులకు అవగాహన కల్పించినారు. భూముల్లో మేలు చేసే సూక్ష్మ క్రిములు లక్షల సంఖ్య లో ఉంటాయని, అవి ఉండటం వలన భూమిలో సేంద్రీయ పదార్థం ఏర్పడుతుందని ఒకవేళ భూముల్లో అవశేషాలు తగలబెట్టినట్లయితే సూక్ష్మ జీవులు చనిపోయి భూమి నిస్సారం అవుతుందని తెలిపారు. రైతులు రోటావేటర్ ద్వారా అవశేషాలు కలియ దున్ని నీరు పెట్టు సూపర్ phosphate చల్లితే అవశేషాలు మురిగి ఎరువు తయారవుతుంది అని తెలిపారు. రైతు అవసరం అయినంత మాత్రమే ఎరువులు వాడాలని సూచించారు. ఈ సమావేశం లో మండల వ్యవసాయ అధికారి సోములపల్లి మానస, వ్యవసాయ విస్తరణ అధికారి ఆయేషా మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.









