పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే రేగా ధర్నా.
*క్యాన్వాసింగ్ అటోపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను వేంటనే అరెస్టు చెయ్యాలి*
నేటి గదర్ వెబ్ డెస్క్: బిఆర్ఎస్ పార్టీ క్యాన్వాసింగ్ చేసే ఆటోపై కాంగ్రెస్ పార్టీ గుండాలు భౌతిక దాడులు పాల్పడ్డారంటూ మణుగూరు పోలీస్ స్టేషన్ ఎదుట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికలలో భాగంగా తమ పార్టీకి క్యాన్వాసింగ్ కి పెట్టిన అటోపై కొంత మంది కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడి చేయడం సరైన పద్ధతి కాదని,దాడికి పాల్పడిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.
Post Views: 140









