‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
తెలంగాణ రాష్ట్ర ప్రతిభను పెంచే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ తీసుకొన్న నిర్ణయం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ను ఈ రోజు గవర్నర్ ప్రారంభించారు. అత్యంత ప్రాధాన్యత గల ఈ సమావేశంలో పలువురు జాతీయ, అంతర్జాతీయ నాయకులు పాల్గొన్నారు
కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి , కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, నొబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, ఆర్థిక శాస్త్ర నొబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ , టీవీఎస్ చైర్మన్ ఆర్. దినేష్ , అపోలో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్పర్సన్ శోభన కామినేని , అన్నపూర్ణ స్టూడియోస్ వైస్ చైర్మన్ హీరో నాగార్జున, అదానీ పోర్ట్స్ డైరెక్టర్ కరణ్ అదానీ , వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జుర్గెన్స్ , ట్రంప్ మీడియా డైరెక్టర్ ఎరిక్ స్విడ్లర్ మరియు తదితరులు పాల్గొన్నారు.









