ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలి.
*అసాంఘిక కార్యకలపలు,గొడవలు సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు*
*మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి*
నేటి గదర్ కరకగూడెం: ఈనెల 11వ తారీఖున జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలలో భాగంగా వివిధ పార్టీల అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు సూచించారు.కరకగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో వివిధ పార్టీలకు సంబంధించిన సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి,ఏడుళ్ళ బయ్యారం సిఐ వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ 11వ తారీఖున జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని అనవసరంగా గొడవలు పెట్టుకొని ఒకరినొకరు దూషించుకోవడం లాంటివి చేయకూడదని అలా చేసినట్లయితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఎన్నికల ముగిసిన అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని, పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను బెదిరింపులు కాని, ప్రలోభాలు పెట్టిన కానీ చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలింగ్ కేంద్రాల వద్ద, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద అల్లరి సృష్టించడానికి ప్రయత్నిస్తే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎస్ఐ పివి నాగేశ్వరరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.









