*పోలీస్ స్టేషన్ నుండి గంజాయి స్మగ్లర్లు పరారి*
వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలోని ప్రత్యేక డ్రగ్ కంట్రోల్ టీం విభాగం వారు ఆదివారం అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లు తమిళనాడు కు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిసింది. అదుపులోకి తీసుకున్న ఆ నలుగురు నిందితులను డ్రగ్ కంట్రోల్ టీం వారు ఆదివారం హనుమకొండ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. కాగా సోమవారం ఆ నలుగురి నిందితుల్లో ముగ్గురు పోలీసుల కళ్లు కప్పి పారిపోయారు. అసలు విషయం ఏమిటంటే ఆ నాలుగవ నిందితుడు కూడా లావుగా ఉండడం మూలాన పరిగెత్త లేక అక్కడే దొరికి పోయాడని సమాచారం. ఈ సంఘటన పై వార్తలు పలు ప్రచార మాధ్యమాలలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. పోలీస్ స్టేషన్లో ఉన్న నిందితులనే పోలీసులు కట్టడి చేయలేక పోయారని ఇక ప్రజలకు ఏ విధమైన రక్షణ కల్పిస్తారని ప్రజా సంఘాల తో పాటు ప్రజలు బాహాటంగానే చర్చించు కుంటున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది! ఈ నేపథ్యంలో వరంగల్ సీపి ఆదేశాల ప్రకారం నిందితులను పట్టుకునేందుకు అన్ని పోలీస్ స్టేషన్ల కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.









