పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ (అడ్మిన్) రామానుజం.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు, ప్రజల భద్రతకు భరోసా కల్పించేలా ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు అడిషనల్ డీసీపీ అడ్మిన్ రామానుజం తెలిపారు.
పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా స్ధానిక పోలీసు బలగాలతో చింతకాని మండలం రామకృష్టపురం, పాతర్లపాడు గ్రామంలో బుధవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ…గ్రామ పంచాయతీ ఎన్నికలు నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సాగేలా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే నాకా బందీ నిర్వహించిన పోలీసులు.. కీలక పాయింట్లపై నిఘా పెట్టి తనిఖీలు ముమ్మరం చేస్తున్నారని అన్నారు.
ముందస్తు ప్రణాళికతో క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో కట్టుదిట్టమైన బందోబస్తుకు అవసరమైన సన్నాహాలు చేపట్టినట్లు తెలిపారు. అందులో భాగంగానే పోలీసు సిబ్బంది అనేక ప్రాంతాల్లో వీధుల్లో తిరుగుతూ.. ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూనే..ఎన్నికలను ప్రశాంతయుతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని, అసాంఘిక శక్తులకు సహకరించ వద్దని కోరుతున్నామని అన్నారు.
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా నచ్చిన వ్యక్తికి, ఓటువేసే ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు పోలీస్ యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని పెర్కొన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడం ప్రశాంత వాతావరణాన్ని భంగం కలిగించే నేరచరితులను బైండోవర్ చేశామని తెలిపారు. అక్రమ మధ్యం, నగదు, కానుకల రవాణాను చెక్ పెట్టేందుకు చెక్ పోస్టుల ద్వారా నియంత్రించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిర్భయంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు ,బ్లూకోల్డ్ బృందాలు నిరంతరం ప్రజలకు అందుబాటులో వుంటూ విధులు నిర్వహిస్తున్నట్లు పెర్కొన్నారు.









