+91 95819 05907

ప్రభుత్వ ఫార్మా రంగ బలోపేతానికి కేంద్రం ఏం చర్యలు తీసుకుంటోంది..?

ప్రభుత్వ ఫార్మా రంగ బలోపేతానికి కేంద్రం ఏం చర్యలు తీసుకుంటోంది..?

* దేశంలో ప్రస్తుతం ఉన్న ఫార్మా పీఎస్ యూలు ఎన్ని?
* వాటి ఆధునికీకరణకు ప్రణాళిక ఉందా..?
* లోక్ సభలో ప్రస్తావించిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
* లిఖిత పూర్వక సమాధానమిచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

న్యూ ఢిల్లీ: దేశంలో ఫార్మా పీఎస్ యూ ( పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్) రంగం బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోo దని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి లోక్‌సభలో ప్రశ్నించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ… దేశంలో ప్రస్తుతం ఉన్న ఫార్మా పీఎస్‌యూల సంఖ్యను, వాటి ఆధునీకరణకు ఎలాంటి ప్రణాళికలు ఆచరిస్తున్నారో వెల్లడించాలని కోరారు. దీనికి కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
దేశంలో ఐదు ఫార్మా పీఎస్ యూలు..
దేశంలో ప్రముఖంగా ఐదు ఫార్మా పిఎస్ యులు ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి తెలిపారు. ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐ డీ పీ ఎల్)రాజస్థాన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఆర్ డీ పీ ఎల్), హిందుస్తాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్(హెచ్ ఏ ఎల్), బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్(బీసీపీ ఎల్)కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్(కే ఏపీఎల్ ఉన్నట్లు తెలిపారు.
ఫార్మా పీఎస్‌యూల ఆధునీకరణకు కొత్త పథకాలు లేవు..
ఫార్మా పీఎస్‌యూలను ఆధునీకరించి పోటీతత్వాన్ని పెంచేందుకు ప్రత్యేక పునరుజ్జీవన లేదా ఆధునీకరణ పథకాలు ఏవీ ప్రభుత్వం అమలు చేయడం లేదుని కేంద్ర సహాయ మంత్రి పేర్కొన్నారు.
ఐడీపీఎల్ కు నిధులు ఇలా..
ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐ డీపీఎల్) ముగింపు ప్రక్రియ కోసం కేంద్రం గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో భారీ నిధులు కేటాయించిందని వివరించారు. 2022–23 లో ₹2.11 కోట్లు, 2023–24 ₹356.44 కోట్లు, 2024–25 ₹39కోట్లు,2025–26(11.12.2025 వరకు) ₹41.11 కోట్లు మొత్తంగా రూ.397.55 కోట్లు రచించినట్లు తెలిపారు వెచ్చించినట్లు తెలిపారు. కేటాయింపుతో పోలిస్తే 99.52 శాతం ఖర్చు పూర్తయిందని కేంద్రం వివరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !