రెండవ విడతలోనూ మన ప్రభంజనం చాటాలి.
బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్,జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల రాజు పిలుపు.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
స్థానిక సంస్థల రెండో పేజ్ ఎన్నికలు ఈనెల 14న జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లోను మన పార్టీ ప్రభంజనం చాటాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల రాజు పిలుపు ఇచ్చారు. ముదిగొండ మండలంలో శుక్రవారం ఉదయం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రెండో విడత లోనూ అభ్యర్ధులు నాయకులు తగు జాగర్తలు తీసుకావాలని సూచించారు మండలంలోని న్యూ లక్ష్మీపురం పండ్రేపల్లి చిరుమర్రి తదితర గ్రామాలు వారు ప్రకటించారు కాంగ్రెస్ పార్టీకి మొదటి విడత ఆశించిన ఫలితాలు రాలేదని ఆయన ఆరోపించారు అందుకు కారణం ఎన్నికల ముందు వాగ్దానాలు అమలు చేయకపోవడమే అన్నారు బీఆర్ఎస్ సిపిఎం తదితర పార్టీలను కలుపుకొని కాంగ్రెస్ అభ్యర్థులపై విజయం సాధించిన సర్పంచ్ వార్డు సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు తెలంగాణ రాష్ట్రం సాధించటానికి 10 ఏండ్లు అధికారంలో ఉండటానికి ఈ గులాబి కండువే కారణమన్నారు జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ మాట్లాడుతూ టిఆర్ఎస్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు వీరి వెంట పార్టీ కార్యదర్శి గడ్డం వెంకట్ మాజీ ఎంపీపీ సామినేని హరిప్రసాద్ సీనియర్ నాయకులు, బంకా మల్లయ్య సెలవరాజ్ కిరణ్,పాపారావు, అమరయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం చిరుమర్రిలో సిపిఎం అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వారు కోరారు









