మధిర నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాల్లో సర్పంచులుగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు
పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరణ
కాంగ్రెస్ పార్టీలో బహిష్కరణల కలకలం
నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి:
మధిర నియోజకవర్గంలోసర్పంచ్ ఎన్నికల్లో పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించిన పలు గ్రామాలకు చెందిన పలు కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
దీనిలోని భాగంగా చింతకాని మండలం వందనం గ్రామ కాంగ్రెస్ శాఖ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షులు పాశం సంజీవ రెడ్డి ఈ బహిష్కరణ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు.
వందనం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేసి, బీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం నిర్వహించిన కారణంగా, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిని తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించినట్లు తెలిపారు.
ఈ రోజు నుంచే బహిష్కరణకు గురైన వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని, వారిని బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారిగా గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సరే చర్యలు తప్పవని కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా గట్టి హెచ్చరిక జారీ చేసింది.
బహిష్కరణకు గురైన సభ్యుల వివరాలు:
పాషా – మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు
కోరిపెల్లి పున్నయ్య
షేక్ మొయిన్









