+91 95819 05907

తెలంగాణలోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పీఎంజీఎస్ వై ద్వారా 1,023 కి. మీ. రోడ్లు.

తెలంగాణలోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పీఎంజీఎస్ వై ద్వారా 1,023 కి. మీ. రోడ్లు.

* రహదారుల సమస్యలపై పార్లమెంట్ లో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి
* నిర్మాణ నాణ్యత పర్యవేక్షణ, నిధుల వివరాలను కోరిన రామసహాయం.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

న్యూ ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ( పిఎంజీఎస్ వై ), ఆర్సిపిఎల్ డబ్ల్యూఈఏ ఆధ్వర్యంలో 1,023 కి. మీ. రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ వెల్లడించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి తెలంగాణలోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల అనుసంధానంపై లోక్‌సభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ..తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా రహదారి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
తెలంగాణలో 146 రహదారి పనులు, 112 వంతెనల నిర్మాణం… ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఈఏ కింద తెలంగాణకు 146 రహదారి పనులు, 112 వంతెనలు మంజూరు చేసినట్లు కేంద్ర సహాయ మంత్రి వెల్లడించారు. మొత్తం 1,023కిలోమీటర్లు కాగా… రూ.681.15 కోట్ల వ్యయంతో ఇప్పటివరకు 39 రహదారి పనులు (478 కి.మీ.), 50 వంతెనల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. మిగిలిన పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని, 2026 మార్చి నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
*నాణ్యత–నిధులపై కేంద్ర పర్యవేక్షణ*
పిఎంజిఎస్ వై కింద చేపడుతున్న రహదారి పనుల నాణ్యతపై మూడు స్థాయిల పర్యవేక్షణ వ్యవస్థ అమల్లో ఉందని కేంద్రం వివరించింది. ఎన్‌ఆర్‌ఐడీఏ సాంకేతిక పరిశీలన, జాతీయ–రాష్ట్ర స్థాయి నాణ్యత తనిఖీలు, సీఏజీ ఆడిట్‌ల ద్వారా నిర్మాణ నాణ్యతను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. నిధుల సకాల విడుదల కోసం రాష్ట్రాలతో నిరంతర సమీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
*జాతీయస్థాయిలో ఇలా..*
2016లో ప్రారంభించిన ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఈఏ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 44 వామపక్ష ప్రభావిత జిల్లాల్లో రహదారి అనుసంధాన పనులు కొనసాగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 12,212 కి.మీ. రహదారులు, 701 వంతెనలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఇందులో 9,764 కి.మీ. రహదారులు, 528 వంతెనలు పూర్తయ్యాయని, మొత్తం వ్యయం రూ.9,339.74 కోట్లు అని వివరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !