నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
మండల పరిధిలో నేరడ గ్రామంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు *మంకెన నాగేశ్వరరావు,సర్పంచ్ దూసరి నేతాజీ* తో కలిసి గ్రామంలో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…దేశం స్వాతంత్రం సాధించిన సమయంలో ఆహారం దొరకక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో హరిత విప్లవం, శ్వేత విప్లవం ద్వారా పంచవర్ష ప్రణాళికలతో దేశానికి కాదు ప్రపంచానికి ఆహార ధాన్యాలు సరఫరా చేసే స్థితికి ఎదిగామని అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైందని అన్నారు.పేదరిక నిర్మూలన ధ్యేయంగా జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందిస్తే నేడు బిజెపి ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నదని అన్నారు. దేశ సంపదను, వనరులను బడా పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేయడమే కేంద్ర ప్రభుత్వ అతి పెద్ద లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు నున్నా వీరయ్య, చెవుల తిరుపతిరావు, లక్ష్మీపతి, సుబానీ, మేడ భాస్కర్, ఆలీస్యం శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.









