నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
రైతులకు యూరియా సరఫరా చేయలేకపోవటం కాంగ్రెస్ పార్టీ అసమర్ధ పాలనకు నిదర్శనం అని గురువారం చింతకాని తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మధిర నియోజకవర్గం ఇన్చార్జ్ లింగాల కమల్ రాజ్ అన్నారు ఈ సందర్భంగా కమల్ రాజ్ మాట్లాడుతూ అధికారులు తక్షణమే స్పందించి రైతులకు కొరత లేకుండా యూరియాని సప్లై చేయాలి.గత 9 సంవత్సరాల కెసిఆర్ పాలనలో యూరియా కొరత లేకుండా రైతు షాపుకి ఆటో పంపించి ఇరువులు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి.వానాకాలం పంటకు సరిపడ ఎరువులు ఇవ్వలేక చెప్పులు లైన్లో పెట్టిచ్చే సందర్భం తీసుకొచ్చింది అని ఆయన మండిపడ్డారు . కాంగ్రెస్ ప్రభుత్వం రెండో పంట కూడా ఎరువులు సప్లై చేయలేకపోవడం కాంగ్రెస్ అసమర్ధ పాలనకు నిదర్శనం.పరిపాలనలో పట్టులేని వారిని తొందరపడి ముఖ్యమంత్రి గా చేసుకుంటే ఇలాంటి కష్టాలే పడాల్సి వస్తుంది అని రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ. రైతులకు యూరియా సరిపడా సరఫరా చేయలేకపోవడం కాంగ్రెస్ పార్టీ చేతగాని తనానికి నిదర్శనమన్నారు గతంలో కెసిఆర్ పాలనలో రైతులు ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేసుకున్నారని అన్నారు, ఇప్పటికైనా మేల్కొని రైతులకు సరిపడ యూరియాని సరఫరా చేయాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బొడ్డు వెంకట రామారావు, మాజీ ఎంపీపీ గురజాల హనుమంతరావు, రైతు నాయకులు మంకెన రమేష్, మండల నాయకులు గడ్డం శ్రీను, వేముల నరసయ్య, పొనుగోతటి రత్నాకర్,బండి రామారావు, వకాయల సత్యం, కోల్లి బాబు,పిన్నెల్లి శ్రీనివాస్, తిమ్మినేని పాలెం సర్పంచ్ ప్రభూదానం, కొమాట్లగూడెం సర్పంచ్ పరిశుద్దరావు,తిరుములపురం సర్పంచ్ వీరబాబు, కోపూరి నవీన్, నాదెండ్ల సురేష్, నాగిలి గొండ మాజీ సర్పంచ్ సురేష్, కొలేటి రాధ తదితర పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









