+91 95819 05907

వ్యవసాయ విద్యార్థులే రేపటి దేశ భాగ్యవిధాతలు: జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

అశ్వారావుపేటలో అట్టహాసంగా ప్రారంభమైన విశ్వవిద్యాలయ స్థాయి క్రీడా పోటీలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 03: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాలలో శనివారం నుండి నాలుగు రోజుల పాటు జరగనున్న విశ్వవిద్యాలయ స్థాయి ఆటల పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా సంబరానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. గౌరవ అతిథిగా విశ్వవిద్యాలయ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ డాక్టర్ చల్లా వేణుగోపాల రెడ్డి పాల్గొనగా, యూనివర్సిటీ అబ్సర్వర్‌గా డాక్టర్ ఎస్. మధుసూధన రెడ్డి వ్యవహరించారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ, వ్యవసాయం అనేది సమాజంలో అత్యంత శక్తివంతమైన మరియు గౌరవప్రదమైన వృత్తి అని కొనియాడారు. సాంకేతిక పరిజ్ఞానం తోడుగా రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సగటు రైతు ఒక ఐఏఎస్ తో సమానమని, ఇక్కడ ఐఏఎస్ అంటే ‘ఇండియన్ అగ్రికల్చరల్ సర్వీస్’ అని ఆయన కొత్త అర్థాన్ని ఇస్తూ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఇటువంటి గొప్ప వృత్తికి సేవ చేసే అవకాశం లభించిన విద్యార్థులు, అధ్యాపకులు నిజంగా అదృష్టవంతులని ఆయన పేర్కొన్నారు. ఆటల్లో గెలుపోటముల కంటే భాగస్వామ్యం ముఖ్యమని, ఈ క్రీడలను కేవలం పోటీగా మాత్రమే కాకుండా ఒకరి నుండి ఒకరు నేర్చుకునే అభ్యసన ప్రక్రియలా భావించాలని విద్యార్థులకు సూచించారు. మరో అతిథి డాక్టర్ చల్లా వేణుగోపాల రెడ్డి మాట్లాడుతూ, క్రీడల వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం మరియు క్రీడా స్ఫూర్తి పెరుగుతాయని తెలిపారు. విశ్వవిద్యాలయ స్థాయి క్రీడా ప్రాచుర్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ క్రీడా సంబరంతో కళాశాలలో పండుగ వాతావరణం ముందే వచ్చిందని యూనివర్సిటీ అబ్సర్వర్ డాక్టర్ మధుసూధన రెడ్డి పేర్కొంటూ, పోటీల నిర్వహణపై నివేదికను సమర్పించారు. విశ్వవిద్యాలయ పరిధిలోని 13 కళాశాలల నుండి సుమారు 467 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత కుమార్ మరియు ఆఫీసర్ ఇంచార్జి ఆఫ్ స్టూడెంట్స్ యాక్టివిటీస్ డాక్టర్ ఎం. రామ్ ప్రసాద్ దగ్గరుండి సమన్వయపరిచారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !