**
మెదక్ జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా మన్నె కళ్యాణ్.
జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాసాయిపేట సర్పంచ్ వీరన్న గారి కృష్ణారెడ్డి.
నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) జనవరి 4.
మెదక్ జిల్లా లో నూతన జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా మన్నే కళ్యాణ్ ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షులుగా సంధ్యా రామకృష్ణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా వీరన్న గారి కృష్ణారెడ్డి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారంనాడు నాడు మసాయిపేట మండలంలో జిల్లా సర్పంచ్ ల సమావేశం నిర్వహించరు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సర్పంచుల వ్యవస్థాపక అధ్యక్షులు భూమన్న యాదవ్, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఆశదీపక్ రెడ్డి, సమక్షంలో జిల్లా అధ్యక్షుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, జిల్లాలోని సర్పంచుల సమస్యలపై అనునిత్యం పోరాటం చేస్తామని వారు అన్నారు, ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, నర్సాపూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి, మరియు జిల్లాలోని వివిధ గ్రామాల సర్పంచ్లు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన వీరన్న గారి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సర్పంచుల వ్యవస్థాపక అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు.









