భారత్ దిగుమతులు పై 500 శాతం సుంకం అమెరికా విధింపు బిల్లు.
వెనుజులా అధ్యక్షుడు ను అపహరించి అమెరికా లో బంధించడం.
ప్రపంచ దేశాల పై అమెరికా చేస్తున్న బలవంతం సుంకాలు, మిలటరీ దాడులను భారత్ ఎదిరించాలి.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు ఖాజా రాధాకృష్ణమూర్తి 20 వర్థంతి సభ లో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు.
రైతాంగ సాయుధ పోరాటంలో గండగలపాడు కు ఘన చరిత్ర.
సిపిఎం డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చా మణి.
నేటి గదర్ న్యూస్,వైరా :- ప్రపంచ దేశాల పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులతో, మిలటరీ దాడులు, సుంకాలు విధింపు లతో లొంగదీసుకున్ని తమ దేశం అధిపత్యం నిలుపుకోవడం కోసం చేస్తున్న అన్ని రకాల చర్యలను భారత ప్రభుత్వం సమర్థవంతంగా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని నరేంద్ర మోడీ విదేశీ వ్యవహారాల్లో అనుసరిస్తున్న వైఖరి భారతదేశానికి ప్రమాదంగా దాపురించే అవకాశం ఉందని మన దేశ ప్రయోజనాల కోసం అలీన ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన సందర్భంలో భారత్ ఉందని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి *బొంతు రాంబాబు* అన్నారు. శుక్రవారం వైరా మున్సిపాలిటీ పరిధిలోని గండగలపాడు లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు ఖాజా రాధాకృష్ణమూర్తి 20 వర్థంతి సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి *బొంతు రాంబాబు, సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు *మచ్చా మణి* మాట్లాడుతూ అమెరికా ఒత్తిడికి లొంగి పత్తి దిగుమతి సుంకం ఎత్తివేయడంతో భారతదేశ రైతాంగానికి తీరని నష్టం జరిగిందని భారత మార్కెట్లో పత్తి ధరలు పడిపోయాయని అన్నారు అమెరికా నుంచి పత్తితో పాటు పాలు మొక్కజొన్న గోధుమ బియ్యం దిగుమతులకు ఒత్తిడి చేస్తున్నారని భారత ప్రభుత్వం అంగీకరించడం లేదని రష్యా నుంచి పెట్రోలియం ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు అనే నెపంతో 500% సుంకాలు భారత నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులు పై విధించడం ద్వారా భారత దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాలని అమెరికా వస్తుందని అన్నారు మరోవైపు అమెరికా పురుగు దేశం వెనిజులాలో ఉన్న నాణ్యమైన పెట్రోలియం ఉత్పత్తులను కారుచౌకుగా అమెరికా కంపెనీలు డ్యూటీ చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు మధురో అడ్డంకి గా ఉన్నాడని భావించి అర్ధరాత్రి అధ్యక్ష భవనం పై మిలటరీ దాడి చేసి అధ్యక్షున్ని అతని భార్యని అపహరించి అమెరికాలో బంధించి ఖైదీ చేయడం అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పరుగు దేశాల యొక్క సౌర్భమాధికారాన్ని నాశనం చేసేందుకు అమెరికా చేస్తున్న కుట్రలను ప్రపంచ దేశాలతో కలిసి భారత ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కోవాల్సిన దక్షిణ అవసరం ఏర్పడిందని అన్నారు తెలంగాణ సాయుధరహితంగా పోరాటం వలసవాదానికి వ్యతిరేకంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించిందని ఆ పోరాట స్ఫూర్తితో నయా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. గండగలపాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అనేకమంది వీరులను అందించిన ఘనత చరిత్ర ఉందని అన్నారు, సిపిఎం సీనియర్ నాయకులు వాసిరెడ్డి విద్యాసాగర్ రావు గారు ఖాజా రాధాకృష్ణమూర్తి గారి స్తూపం వద్ద ఎర్రజెండా ఎగరేశారు కాజా కృష్ణ రాకేష్ రాధాకృష్ణమూర్తి చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు మల్లెంపాటి రామారావు, పల్లె బోయిన కృష్ణ ,దేవ భక్తున్ని నరసింహారావు. ఇమ్మడి వీరభద్రం, కిన్నెర మోతి, కామినేని రవి,ఇమ్మడి సుదీర్,మోటపోతుల వెంకటేశ్వరరావు , చిత్తారు మురళి, వెంపటి రాజా,మహేష్, గుంటుపల్లి కామలేశవరావు , బాబు తదితరులు పాల్గొన్నారు.









