నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) జనవరి 14.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల గ్రామ పంచాయతీ సర్పంచ్ మానవత్వం చాటుకున్నారు. ప్రభుత్వం గ్రామ పంచాయితీ కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడంతో సంక్రాంతి పండుగ వేళ పస్తులు ఉంటారని ఆలోచనతో వెల్దుర్తి సర్పంచ్ దండం ఆదర్శ్ తన సొంత పైసలు 95వేల రూపాయలు గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులకు అందజేయడం చాలా గర్వకారమని పలువురు అభినందించారు. వెల్దుర్తి సర్పంచ్ దండం ఆదర్శ్ 95 వేల రూపాయల తన సొంత నిధులతో గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు ఇవ్వడంతో గ్రామ పంచాయతీ కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మెదక్ జిల్లా వ్యాప్తంగా చాలా గ్రామపంచాయతీ ఆఫీసులలో పనిచేస్తున్న పరిశుద్ధ కార్మికులకు ఇప్పటివరకు జీతాలు అందరం లేదని ఆందోళన ఉండడంతో వెల్దుర్తి సర్పంచ్ దండం ఆదర్శ్ తీసుకున నిర్ణయం పలువురు ఆదర్శంగా తీసుకుంటే కార్మికులకు ఏ ఇబ్బంది ఉండదు అని రాజకీయ నాయకుల విశ్లేషణ.









