క్రీడాకారులు తమ ప్రతిభను చాటాలి
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
సంక్రాంతి పండుగ సందర్భంగా నరసింహ పురం గ్రామం లో ఉజ్వాల యూత్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించినారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసింహపురం గ్రామ సర్పంచ్ లోయ ఉపేందర్ యాదవ్ హాజరయ్యారు,ఈ సందర్భంగా ఉపేందర్ క్రీడా పోటీలను ప్రారంభించినారు, తదనంతరం సర్పంచ్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలను క్రీడాకారులు వేదికగా చేసుకొని తమ ప్రతిభను చాటాలన్నారు, విద్యార్థులు చదువుతోపాటు,క్రీడలను అలవాటు చేసుకోవాలని సూచించినారు. శరీరక మానసిక ఉల్లాసం, శరీరక దారుఢ్యత, ఆత్మవిశ్వాసం లభిస్తుందని తెలిపారు.అదేవిధంగా నరసింహపురం ఆరవ వార్డు నెంబర్ ల** పెళ్లి నిర్మల & శ్రీను ఆటలకు సంబంధిత వాలీబాల్, నెట్, లైట్లు, పిల్లలకు బహుకరించినారు అందజేసినారు, ఈ కార్యక్రమంలో ఇంగ్లీష్ టీచర్ కే బాబు, లోయ సైదులు.ఐదవ వార్డు నెంబర్ ల** పల్లి ఇందిరమ్మ.గోవిందరావు.ఏపూరి శ్రీకాంత్. జక్కుల ఉపేందర్. కర్రి తిరుమల్. . పండగ నాగయ్య.తదితరులు పాల్గొన్నారు.









