గోపాలపురంలో ఉత్సాహంగా ప్రారంభమైన వాలీబాల్ టోర్నమెంట్
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 18: యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమని అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గోపాలపురం గ్రామంలో గోపాలపురం, గుర్వాయిగూడెం, జమేధారుబంజరు గ్రామాల యువత సంయుక్తంగా నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్న మెచ్చా, స్వయంగా వాలీబాల్ ఆడి యువతలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆటలు మానసిక ప్రశాంతతను, శారీరక దృఢత్వాన్ని ఇస్తాయని, గ్రామీణ ప్రాంత క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అధికారం ఉన్నా లేకున్నా క్రీడల ప్రోత్సాహానికి, యువత సంక్షేమానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, కొయ్యల అచ్యుత్ రావు, మాజీ వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావుతో పాటు దారా యుగంధర్, సోయం వీరభద్రం, మన్నెం అప్పారావు, పాశం ప్రసాద్, యార్లగడ్డ శ్రీను, అశోక్, ఏసు, శ్రీను, రాంబాబు, పిట్టల నవీన్, పానుగంటి గణేష్, లక్కీ, నాని తదితర నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.









