మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు…
బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.
నేటి గదర్ న్యూస్, వైరా:
బిఆర్ఎస్ పార్టీలో చేరిన వైరా మున్సిపాలిటీ రెండవ వార్డుకు చెందిన పలు కాంగ్రెస్ కుటుంబాలు
వైరా మున్సిపాలిటీ పరిధిలోని 2 వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు తిరుపతి శ్రీను తో పాటు పలు కుటుంబాలు సోమవారం హైదరాబాద్ లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వారికి కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈమధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక సీట్లు సాధించిందని ప్రజల్లో ఆదరణ పెరిగిందని మరలా కేసీఆర్ ప్రభుత్వమే కోరుకుంటున్నారని అన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన అబద్దపు హామీలు నెరవేర్చలేక పోయిందని ప్రజల్లోకి వెళ్లలేక పోతున్నామని రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కు ఉన్న ఆదరణ చూసి కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లోకి చేరుతున్నామని నాయకులు అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జునరావు,వనమా విశ్వేశ్వరరావు,బిఆర్ఎస్ వైరా మండల పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు,మద్దేల రవి, దొంతెబోయిన వెంకటేశ్వర్లు, మాదినేని ప్రసాద్,మేదరమెట్ల రాము, వజినేపల్లి చక్రవర్తి, ఏదునూరి శ్రీను,వేముల రవి,బత్తుల లింగారావు,బత్తుల వెంకటేష్,వెముల శివ క్రీష్ణా,,దేవళ్ళ శ్రీను,తమ్మిశేట్టి నరేష్, బత్తుల ఉపెందర్,వల్లేపు శ్రీను,వెముల శ్రీను,బండారు శ్రీనివాస్,తిరుపతి రవి,పల్లపు రాంబాబు,దేవళ్ళ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.









