ఖమ్మం టౌన్,నేటి గదర్:
ఖమ్మం ప్రాంతానికి చెందిన ఆరు సంవత్సరాల బాబు ప్రతినెల రక్తస్రావం అవుతూ ప్లేట్లెట్స్ పడిపోయి ఇబ్బంది పడుతున్న సమయంలో తల్లిదండ్రులు సోమాజిగూడ యశోద హాస్పిటల్ ను సంప్రదించగా అక్కడున్న వైద్య బృందం వెంటనే బోన్ మ్యారో పరీక్షలు నిర్వహించగా అప్లాస్టిక్ అనిమీయ గా నిర్ధారించడం జరిగిందని దీనికి ఆల్లో జెనిక్ బోన్ మారో ట్రాన్స్ఫాంటేషన్ విజయవంతంగా నిర్వహించాము అని సంవత్సరం తర్వాత తన ఆరోగ్యం నిలకడగా ఉందని సోమాజిగూడ యశోద హాస్పిటల్ డాక్టర్ అశోక్ కుమార్ ( హేమాటలజీ & బి.యం.టి ) ఖమ్మంలో జరిగిన యశోద మెడికల్ సెంటర్ సమావేశంలో తెలియజేశారు . హేమటాలజీ , బోన్ మరో ట్రాన్స్ ప్లాంట్ , లుకేమియా , లింఫోమా , మల్టీఫుల్ మైలోమ , అప్లాస్టిక్ అనీమియా , తల సేమియా , సికిల్ సెల్ డిసెస్ వంటి రక్త రుగ్మతలకు పెద్దలకు , పిల్లలకు సమగ్ర చికిత్స అందుబాటులో ఉందని పేర్కొన్నారు . ఇప్పటి వరకు 450 పైగా బోన్ మారో ట్రాన్స్ఫాంటేషన్లు విజయవంతం చేసామన్నారు . దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయి హెమటాలజీ సేవలను అందించడమే లక్ష్యంగా యశోద హాస్పిటల్స్ ముందుకు సాగుతుందని తెలిపారు . ఖమ్మం యశోద మెడికల్ సెంటర్ ప్రతినెల నాలుగో మంగళవారం హేమ అంకాలజీ డాక్టర్ అందుబాటులో ఉంటారని అన్నారు . సంపాదించాల్సిన నెంబర్ 7075172575 . ఈ కార్యక్రమంలో డాక్టర్ విక్రమ్ కుమార్ మరియు హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు .









