*జనసేన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తుంది*
*మున్సిపల్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తాం నిబద్ధత కలిగిన నాయకులకు పార్టీ టికెట్ లు ఇస్తాం* : మిరియాల రామకృష్ణ
ఖమ్మం టౌన్,నేటి గదర్ : జనసేన పార్టీ మున్సిపల్ , కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తుందనీ ఆ పార్టీ ఖమ్మం జిల్లా కో ఆర్డినేటర్ మిరియాల రామకృష్ణ తెలిపారు . బైపాస్ రోడ్డు లోని కృష్ణా ఫంక్షన్ హాల్ లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని తెలియజేసారు . జంపు జిలానీ నేతలను కాకుండా నిబద్ధత గల యువతను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు . ఒక పార్టీలో గెలిచి పదేళ్లు పదవులు అనుభవించి మళ్లీ మరో పార్టీలో చేరుతూ వాల్లే కోట్లు పోసి టికెట్లు కొనుక్కుంటున్నారనీ విమర్శించారు . జరగబోయే కార్పొరేషన్ , మున్సిపల్ ఎన్నికల్లో అధికార , ప్రతిపక్ష పార్టీలకు గట్టి పోటీ ఇవ్వబోతున్నామని తెలిపారు . ఈ కార్యక్రమం లో బండారు రామకృష్ణ , బానోత్ దేవేందర్ , ఉత్తమ్ , హసీనా తదితరులు పాల్గొన్నారు .









