సింగరేణిలో కాలరీస్లో అక్రమాలు జరిగాయని కేంద్ర దర్యాప్తు కమిటీ నిగ్గు తేల్చినట్లు సమాచారం
నైనీ కోల్ బ్లాక్ స్కాం, సింగరేణి నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపిన కేంద్ర దర్యాప్తు కమిటీ
ఆదేశించిన 24 గంటలలోపే విచారణ పూర్తి.. నివేదిక కేంద్ర బొగ్గు గనుల శాఖకు అందజేసినట్లు సమాచారం
కనీస నిబంధనలు పాటించకుండా సీఎస్ఆర్ నిధులు దుర్వినియోగం జరిగినట్లు గుర్తింపు
స్వయం ప్రతిపత్తి హోదాను అడ్డు పెట్టుకొని రాష్ట్రప్రభుత్వ పెద్దలు నిబంధనలు ఉల్లంఘించినట్లు సమాచారం
బొగ్గు గనుల కార్మికుల శ్రమతో కూడిన డబ్బులను, మెస్సీతో మ్యాచ్ ఆడేందుకు, ఇతర ప్రైవేట్ కార్యక్రమాలు ఎలా ఉపయోగిస్తారని కేంద్ర అధికారులు ఆశ్చర్యం
నిధుల మళ్లింపు వెనుక ఉన్న ఉన్నతాధికారుల పాత్రపై విచారణ వేగవంతం చేయాలని ఆదేశం
నైనీ బ్లాక్ టెండర్ల వివాదం, నిధుల దుర్వినియోగం అన్ని అంశాలను పొందుపరుస్తూ కమిటీ ప్రాథమిక నివేదికను శుక్రవారం సాయంత్రమే బొగ్గు గనుల శాఖకు, కోల్ ఇండియా ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం
కేంద్ర దర్యాప్తు కమిటీ నివేదిక ద్వారా త్వరలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం









