+91 95819 05907

గెలుపు గుర్రాలకే టికెట్లు:మంత్రి పొంగులేటి

టికెట్ల కేటాయింపులో పూర్తి పారదర్శకత :మంత్రి పొంగులేటి

మున్సిపల్ ఎన్నికల్లో ‘క్లీన్ స్వీప్’ లక్ష్యంగా పనిచేయాలి

పార్టీ గెలుపే పరమావధిగా అందరూ సమన్వయంతో సాగాలి

సర్వే ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఇల్లందు నేతలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం

ఖమ్మం టౌన్,నేటి గదర్:
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇల్లందు మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి మున్సిపల్ ముఖ్య నేతలు, ఆశావహులతో మంత్రి సమావేశం నిర్వహించారు.
ఎన్నికల ప్రక్రియ అతి త్వరలోనే ప్రారంభం కానుందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. “వచ్చే నెల మధ్య నాటికి ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. సమయం తక్కువగా ఉన్నందున పార్టీ శ్రేణులు ఇప్పుడే క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

టికెట్ల కేటాయింపులో పూర్తి పారదర్శకత పాటిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి వార్డులో ప్రజల ఆమోదం, అభ్యర్థి యోగ్యత ఆధారంగా శాస్త్రీయంగా సర్వే నిర్వహించి, ఆ నివేదికల ప్రకారమే బి-ఫామ్ ఇస్తామని వెల్లడించారు. పార్టీ పట్ల విధేయత, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుందని, ఎలాంటి ప్రలోభాలకు తావులేకుండా అర్హులకే సీట్లు దక్కుతాయని భరోసా ఇచ్చారు. పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని మంత్రి కోరారు.

“ఒకే వార్డులో ఎక్కువ మంది అభ్యర్థులు ఉండటం సహజం. కానీ బి-ఫామ్ ఒకరికే దక్కుతుంది. టికెట్ రాని మిత్రులు ఆందోళన చెందవద్దు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరినీ గుర్తించి, భవిష్యత్తులో కో-ఆప్షన్ సభ్యులుగా లేదా ప్రభుత్వంలోని ఇతర పదవుల ద్వారా వారి రాజకీయ గౌరవానికి భంగం కలగకుండా చూసే బాధ్యత నాదే” అని హామీ ఇచ్చారు. పార్టీ లైన్ దాటకుండా, ప్రతి ఒక్కరూ అధికారిక అభ్యర్థి గెలుపు కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

“ఇల్లందు అభివృద్ధికి ఇప్పటికే కోట్ల రూపాయల నిధులను కేటాయించాం. మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో మన అభ్యర్థులను గెలిపిస్తే, భవిష్యత్తులో మరింత భారీగా నిధులు తీసుకువచ్చి ఇల్లందు రూపురేఖలు మారుస్తా” అని మంత్రి వాగ్దానం చేశారు. తనను నమ్ముకున్న కార్యకర్తలను కుటుంబ సభ్యుల్లా కాపాడుకుంటానని, అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !