+91 95819 05907

విహే క్యాంపస్ , గురుదక్షిణ ఫౌండేషన్ , శ్రీ రామకృష్ణ విద్యాలయం లను సందర్శించిన సిఎస్ఆర్ సుమ్మిట్ బృందం

**

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్:
ఖమ్మం : భద్రాచలం ప్రయాణంలో భాగంగా మార్గమధ్యంలో ఖమ్మంలో సిఎస్ఆర్ సుమ్మిట్ బృందానికి శ్రీ దేవకీ వాసుదేవరావు — ఖమ్మం విభాగ్ అధ్యక్షులు , శ్రీ సరస్వతి విద్యాపీఠం వ్యవస్థాపకులు , వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ (విహే) మరియు దేవకీ ఫౌండేషన్ — ఆతిథ్యం అందించారు . దక్షిణ భారతదేశంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తున్న సౌత్ ఇండియా ’s సిఎస్ఆర్ సుమ్మిట్ ఆధ్వర్యంలో , 2026 జనవరి 27న భద్రాచలంలో టైనీలూప్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతోంది . ఈ కార్యక్రమంలో విద్య , ఆరోగ్యం , జీవనోపాధి , స్థిరత్వం (సూస్తాయినాబిలిటీ) వంటి సమాజాభివృద్ధికి కీలకమైన అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి . ఈ సందర్భంగా సౌత్ ఇండియా ’s సిఎస్ఆర్ సుమ్మిట్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ ముత్యాపు , వల్లాల సుమంత్ , వినీల్ మరియు వారి బృందం విహే క్యాంపస్ , గురుదక్షిణ ఫౌండేషన్ , శ్రీ రామకృష్ణ విద్యాలయంలను సందర్శించారు . శ్రీ రామకృష్ణ విద్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో దేవకీ వాసుదేవరావు మరియు డా.అన్నదానం సుబ్రహ్మణ్యం సిఎస్ఆర్ సుమ్మిట్ బృందాన్ని ఉద్దేశించి సమాజాభివృద్ధిలో విద్య , విలువలు , సేవా భావన ప్రాధాన్యతపై ప్రేరణాత్మక ప్రసంగాలు చేశారు . ఈ సమావేశం ద్వారా సమాజాభివృద్ధి లక్ష్య సాధనలో సమిష్టి కృషి , భాగస్వామ్యం ఎంత కీలకమో స్పష్టమైంది . విద్యా , సేవా మరియు కార్పొరేట్ రంగాల మధ్య సమన్వయంతోనే స్థిరమైన మరియు సమగ్ర అభివృద్ధి సాధ్యమని ఈ కార్యక్రమం స్పష్టం చేసింది . ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి గన్నవరపు చంద్రశేఖర్ , కరవది శ్రీనివాస్ , సుబ్బారావు , ప్రాధానాచార్యులు , ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు .

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !