నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు ఫుట్బాల్ , అథ్లెటిక్స్ విజేతలకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పూనకోలు నీరజ ,డిప్యూటీ మేయర్ ఫాతిమా, డివైస్ ఓ సునీల్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ కే. శ్రీనివాస్ రావు, అసిస్టెంట్ కమిషనర్ అనిల్, మండల విద్యాశాఖ అధికారిని శైలజలక్ష్మి, టూ టౌన్ సిఐ బాలకృష్ణ, అథ్లెటిక్స్ కోచ్ గౌస్ చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేశారు. కాగా
ఖమ్మం కార్పొరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బియ్యని కృష్ణయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ
విజేతల వివరాలు వెల్లడించారు.
ఫుట్బాల్ గర్ల్స్ విన్నర్స్ జెడ్పిహెచ్ఎస్ మల్లెమడుగు, రన్నర్స్ జిహెచ్ఎస్ ఇందిరానగర్, ఫుట్బాల్ బాయ్స్ విన్నెర్స్ న్యూ విజన్ స్కూల్ , రన్నర్స్ స్టేడియం టీం లు. ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని అఫీషియల్స్ పారిజాత, లాలయ్య, నాగుల మీద, రాము, రోజా, విజయకుమారి, సంపత్, నాగప్రసాద్, మల్లయ్య, నాగేశ్వరరావు, నాగరాజు, రజిత, సిఎం కప్ కోఆర్డినేటర్ ఆదర్శ్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ అనిల్, కోచ్ నోహెల్, ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.








