అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!
అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 31: అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల సమరంలో కారు గుర్తు గెలుపే లక్ష్యంగా బిఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. శనివారం మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి కాసాని నాగశేష పద్మ, మాజీ జెడ్పిటిసి సున్నం నాగమణి ఆధ్వర్యంలో 19వ మరియు 22వ వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. బిఆర్ఎస్ మరియు తెలుగుదేశం పార్టీలు ఉమ్మడిగా బలపరిచిన 19వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నార్లపాటి శ్రీనివాసరావు, 22వ వార్డు అభ్యర్థి జుజ్జారపు శ్రీరామ్ మూర్తిల విజయానికి మద్దతు కోరుతూ నేతలు ఇంటింటికీ తిరిగారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ, స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసే తమ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్, రాజు మరియు పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని హోరెత్తించారు.








