ప్రజాక్షేత్రంలో మాజీ ఎమ్మెల్యే ‘కట్టెపుల్లల’ కసరత్తు: వినూత్న శైలిలో తాటి వెంకటేశ్వర్లు ప్రచారం!
వార్డు అభ్యర్ధుల గెలుపు కోసం నడుం బిగించిన మాజీ ట్రైకార్ చైర్మన్.. సామాన్యులతో మమేకమవుతూ ఓట్ల వేట.
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 03: అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల వేళ రాజకీయ సందడి పతాక స్థాయికి చేరింది, ఇందులో భాగంగా 5వ వార్డు అభ్యర్థి ఎండి రెహానా బేగం విజయమే లక్ష్యంగా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు రంగంలోకి దిగి వినూత్న రీతిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలతో ఎప్పుడూ సన్నిహితంగా ఉండే ఆయన, ప్రచారంలో భాగంగా శనివారం వార్డులోని ప్రతి ఇంటినీ సందర్శిస్తూ, ఒక సామాన్యుడిలా మారిపోయి ప్రజలను ఆశ్చర్యపరిచారు. ఒక ఇంటి వద్ద మహిళలు కట్టెపుల్లలు కొడుతుండటం గమనించిన వెంకటేశ్వర్లు, స్వయంగా గొడ్డలి పట్టుకుని కట్టెలు కొడుతూ వారితో ముచ్చటించి, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. పదవుల కంటే ప్రజా సేవయే మిన్న అని చాటుతూ, రెహానా బేగంకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. అగ్రనేత స్థాయి వ్యక్తి తమ మధ్యకు వచ్చి సామాన్యుడిలా కలిసిపోవడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఈ వినూత్న ప్రచారం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది.








