*మృత్యు మార్గము*
*ఆదమరిస్తే అనంత లోకాలకి*
*ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు*
*నేటి గదర్ న్యూస్ గుండాల*,గుండాల నుండి మణుగూరు వెళ్లే ప్రధాన రహదారి సాయనపల్లి గ్రామ సమీపంలో రహదారి మృత్యు మార్గంగా మారింది, ఆ రహదారి గుండా వెళ్లే ప్రయాణికులు ఆదమరిస్తే అనంత లోకాలకు పోవడం ఖాయం. సాయనపల్లి గ్రామానికి చెందిన వాగబోయిన చంద్రయ్య దొర మాట్లాడుతూ గత వర్షాకాలం సీజన్లో వరద ప్రవాహానికి కలవాట్ కోతకు గురై ప్రమాదకరంగా మారింది స్థానిక పంచాయతీ అధికారులు ఆర్ అండ్ బి అధికారులు ఇంతవరకు ఈ సమస్యపై దృష్టి సారించకపోవడంతో ప్రమాదకర మలుపుగా మారింది ఏమరపాటున ప్రయాణికులు ఉంటే ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయడం ఖాయం. పలుమార్లు స్థానిక అధికార్ల కు చెప్పితే RB అధికారలుకు చెప్పినం రెండు మూడు రోజులలో అవుతుంది అని చెబుతున్నారే తప్ప సమస్యను పరిష్కరించడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకముందే ప్రమాదకరమైన ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన విన్నవించుకుంటున్నారు








