నేటి గదర్, ఖమ్మం:
బిఆర్ఎస్,సిపిఎం,సిపిఐ అభ్యర్థులను గెలిపించండి..
ఖమ్మం ఇంచార్జుల మరియు పోటీ చేసిన కౌన్సిలర్ అభ్యర్థులకు పలు సూచనలు చేసిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..
వైరా మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిని ప్రకటించి క్లారిటీతో పనిచేస్తున్నామని మిగతా పార్టీలు అంత దైర్యం చేయలేకపోతున్నామని అన్నారు.
ఓటర్లను కన్ఫ్యూజ్ చేయడానికి కొన్ని వార్డులనందు చపాతీ రోలర్ గుర్తులతో కన్ఫ్యూజ్ చేస్తున్నారని అలాంటి ఎత్తు గడలను తిప్పి కొట్టాలని తెలిపారు.
కాంగ్రెస్ 25నెలల కాలంలో ప్రజలను మోసం చేసి 6గ్యారంటీలను మంగళం పాడిందని నాట్లకు నాట్లకు మధ్యలో రైతు బందు వేసిన కేసీఆర్ ఇప్పుడు ఓట్లకు ఓట్లకు మధ్యలో రైతు భరోసా వేస్తున్న రేవంత్ అని కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రజల్లోకి తీసుకెళ్లి బిఆర్ఎస్,సిపిఎం,సిపిఐ అభ్యర్థులను గెలుపునకు కృషి చేయాలని ఇంచార్జులను కోరారు.
కాంగ్రెస్,బీజేపీ పార్టీల నుండి షేక్ పాషా,పల్లెపు రాము,మరికంటి శివ,గుగులోతు రాము తదితరులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.








