*హౌసింగ్ పనుల పురోగతిపై సమగ్ర సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు*
📅 తేదీ: 18 ఫిబ్రవరి 2026
📍 స్థలం: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం
🗺️ మండలం: మణుగూరు
🏞️ జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం
🔹మణుగూరు మండల పరిధిలో హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అమలు అవుతున్న గృహ నిర్మాణ పనుల పురోగతి, లబ్ధిదారుల ఎంపిక, నిర్మాణ నాణ్యత, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై *ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు* ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు.
🔹ఈ సమావేశంలో MRO, MPDO, FDO, FRO, ITDA-DE, AE తదితర శాఖల అధికారులు పాల్గొని తమ తమ విభాగాల పనుల పురోగతిని వివరించారు. మండలంలో మంజూరైన ఇళ్ల నిర్మాణ స్థితి, పూర్తి అయిన గృహాలు, నిర్మాణంలో ఉన్న ఇళ్లు, ఇంకా ప్రారంభం కాని పనులపై వివరాలను *ఎమ్మెల్యే గారు* అడిగి తెలుసుకున్నారు.
లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గృహ నిర్మాణ పనులు పూర్తి చేసుకునేలా అవసరమైన సాంకేతిక సహాయం, నిర్మాణ సామగ్రి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో ఆలస్యం జరిగితే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. గృహ నిర్మాణం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, ప్రతి దశలో పర్యవేక్షణ పెంచాలని, అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న గృహ పథకాల ప్రయోజనాలు సమయానికి చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని *ఎమ్మెల్యే గారు* సూచించారు. అంతేకాకుండా, కాలనీలలో రహదారులు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులు సమగ్రంగా కల్పించేందుకు ముందస్తు ప్రణాళికతో పని చేయాలని తెలిపారు. ప్రజలకు ఇళ్లు కేవలం నిర్మించడం మాత్రమే కాకుండా, నివసించడానికి అనుకూలమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని *ఎమ్మెల్యే గారు* స్పష్టం చేశారు.
ఈ సమీక్ష సమావేశం ద్వారా హౌసింగ్ పనులు వేగవంతం అవడంతో పాటు లబ్ధిదారులకు త్వరితగతిన గృహాలు అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.








