కరెంట్ షాక్ తో గేదె మృతి.
పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం పంచాయతీ కొత్తరెడ్డిపాలెం గ్రామంలో కరెంట్ షాక్ తో గెదె మృతి చెందింది. కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన తుమ్మ సంజీవ రెడ్డి అనే రైతుకు చెందిన గేదే మేతకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లె సమయంలో ప్రధాన రహదారి పక్కన గల కరెంట్ ట్రాన్ష్ఫారం ఎర్తు తగలడం వలన అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన గేదె విలువ సుమారు లక్ష ఇరవై వేల రూపాయలు ఉంటుందని రైతు తెలిపారు. గతంలో ఇదే ప్రాంతంలో ఆరు గేదెలు చనిపోయినట్లు రైతులు తెలిపారు. ఇకనైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి కరెంట్ స్థంబాల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Post Views: 6








