గుండెపోటుతో వ్యక్తి మృతి
కారేపల్లి, గుండెపోటుతో వ్యక్తి మతి చెందిన ఘటన కారేపల్లి మండలం దుబ్బతండాలో బుధవారం చోటుచేసుకుంది. దుబ్బతండాకు చెందిన భూక్య శ్రీను(38) మణుగూరు లో బంధువుల ఇంటికి పనిపై వెళ్లాడు. అక్కడ భోజనం చేస్తుండగా గుండెలో నొప్పి రావటంతో భోజనం మీదనుండి లేచి చాతిలో నొప్పి వస్తుందని పక్కకు వెళ్లాడు. చాతిపై చేయి వేసి నెక్కిపెడుతూనే కుప్పకూలిపోయాడు. బంధువులు అతనిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మతి చెందాడు. మతినికి భార్య మౌనిక ఒక కుమార్తె ఇద్దరు కుమారులు ఉన్నారు. అందరితో కలుపుగోలుగా ఉంటే శ్రీను మతితో దుబ్బతండాలో విషాధచ్ఛాయలు నెలకొన్నాయి.
Post Views: 6








