+91 95819 05907

నా పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

నా పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

♦️తన పేరుతో కొంతమంది సంస్థలు ఏర్పాటు చేసిన విషయంపై స్పందించిన కేటీఆర్

♦️ఎవరైనా పనిచేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేయాలని కేటీఆర్ విజ్ఞప్తి

తన పేరుతో ఎలాంటి సంస్థను కూడా ఏర్పాటు చేసేందుకు తన అనుమతి లేదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కొంతమంది ‘కేటీఆర్ సేవా సమితి’, ‘కేటీఆర్ సేన’ పేరుతో కొన్ని కార్యకలాపాలు చేపడుతున్న విషయాన్ని కేటీఆర్ దృష్టికి పలువురు తీసుకొచ్చారు. దీనితోపాటు కేటీఆర్ పేరుతో ఇతర సంస్థలను ఏర్పాటు చేసుకున్న అంశాన్ని కూడా కేటీఆర్‌కు తెలియజేశారు.

ఈ నేపథ్యంలో తన పేరుతో ఎలాంటి సంస్థలకీ అనుమతి లేదని… అలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని కేటీఆర్ తెలిపారు. ఇలాంటి సంస్థలకు ఎటువంటి గుర్తింపు, అనుమతి లేదన్న విషయాన్ని అందరూ గుర్తించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

ఎవరైనా పనిచేయాలనుకుంటే కచ్చితంగా భారత రాష్ట్ర సమితి పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. తన పేరుతో పలు సంస్థల ద్వారా చేస్తున్న కార్యక్రమాలను ఆపేయాలని… తనపై అభిమానం ఉన్నవాళ్లు ఎవరైనా భారత రాష్ట్ర సమితితో కలిసి పనిచేయవచ్చని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

నా పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

నా పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ♦️తన పేరుతో కొంతమంది సంస్థలు ఏర్పాటు చేసిన విషయంపై స్పందించిన కేటీఆర్ ♦️ఎవరైనా పనిచేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో

Read More »

బంగారం ధరలు అందుకే పెరుగుతున్నాయి: ఆర్థిక మంత్రి

* దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేపట్టడంతోనే బంగారం ధరకు రెక్కలు వచ్చాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్‌ అన్నారు. ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డ్‌ సమావేశం అనంతరం

Read More »

అమ్మాయిలూ.. జాగ్రత్త!! పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదం!!

అమ్మాయిలూ.. జాగ్రత్త!! పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదం!! హైదరాబాద్ లో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం ప్రేమ పేరుతోనే కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధాల మాటున కూడా కొందరు

Read More »

మెట్లపై నుండి జారి పడి భర్త మృతి.. మనస్తాపంతో పెట్రోల్ పోసుకొని భార్య బలవన్మరణం

మెట్లపై నుండి జారి పడి భర్త మృతి.. మనస్తాపంతో పెట్రోల్ పోసుకొని భార్య బలవన్మరణం మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మమత(30)ను 14 నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్న

Read More »

గత 7 ఏళ్ల నుంచి వరుసగా రాష్ట్ర స్థాయి సెమినార్ కు ఎంపిక ★ప్రభుత్వ ఉపాధ్యాయుడు పోగు అశోక్ కు పలువురి అభినందనలు

*పోగు అశోక్ ను ఎంపిక – గత 7 ఏళ్ల నుంచి వరుసగా రాష్ట్ర స్థాయి సెమినార్కు ఎంపిక* *జనగాం జిల్లా* *23 ఫిబ్రవరి 2026* జనగాం జిల్లాలోని కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన

Read More »

ఆళ్లపల్లి మండలం రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి – సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ – లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

🌟 *ఆళ్లపల్లి మండలం రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి – సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ – లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు చేయూత* 🌟 📅 తేదీ: 23 ఫిబ్రవరి

Read More »

 Don't Miss this News !