*కుమ్మేర మల్లన్న స్వామి జాతరలో రజక సోదరులపై జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన పసికందు ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన తీన్మార్ మల్లన్న గారు, నేడు బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించారు.*
*కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి TRP పార్టీ సంపూర్ణ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.*
*అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో కలిసి నాగర్ కర్నూలు జిల్లా పోలీస్ స్టేషన్కు వెళ్లిన మల్లన్న గారు,దాడికి పాల్పడిన దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.*
*ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్తో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.*
*నేరస్థులను పట్టుకుని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే వరకు తాము వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.*
*బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.*
*సమాజంలో కులం పేరుతో జరిగే అన్యాయాలపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎప్పుడూ బాధితుల పక్షాన నిలబడుతుందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.*








