ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు… మంచిదే
అలాగే కేసులు ఎత్తివేయండి
భూదాన భూములపై శ్వేత పత్రం ప్రకటించండి
మిగతా లబ్ధిదారులకు కూడా ఇక్కడే ఇల్లు నిర్మించి ఇవ్వండి
____ ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బానోతు బద్రు నాయక్
నేటి గదర్ న్యూస్, ఖమ్మం: మార్చి 11 : ఆలస్యంగా నైనా రాష్ట్ర ప్రభుత్వం తన తప్పులను గుర్తించి , వెలుగుమట్ల లోని భూదాన భూముల లబ్ధిదారులకు ఇక్కడే ఇళ్ల స్థలాలు ఇవ్వడం మంచి నిర్ణయం , అలాగే భూదాన భూముల అంశంలో అరెస్టు కాబడ్డ వారందరి పై కేసులు ఎత్తివేసి , భూదాన భూముల మొత్తం వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం ప్రకటించాలని , మిగతా లబ్ధిదారులకు సైతం ఇక్కడే ఇల్లు నిర్మించి ఇవ్వాలని లంబాడి హక్కుల పోరాట సమితి ( ఎల్ హెచ్ పి ఎస్ ) రాష్ట్ర అధ్యక్షుడు బానోతు బద్రు నాయక్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పి భూదాన భూముల
లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని , మిగతా లబ్ధిదారులకు కూడా ఇక్కడే ఇళ్ల స్థలాలు ఇ చ్చి న్యాయం చేయాలని కోరారు. వారంతా పేదలు , నిజమైన లబ్ధిదారులు గా భావించారు కాబట్టే అధికారులు ఆ లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించుకున్న విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటే మరి కేసులు ఎందుకు ,ఆందోళనలు ఎందుకు ? కూల్చివేతలు ఎందుకు ? జరిగాయో వివరించాలని తెలిపారు. ఇతర చోట్ల నుండి వచ్చిన లబ్ధిదారులకు వారి సొంత ప్రాంతాలలోనే ఇళ్లస్థలాలు కేటాయిస్తా మనడం సమంజసంగా లేదన్నారు. వారికి కూడా ఇక్కడే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూదాన బోర్డు చైర్మన్ చెప్తున్న దానికి విరుద్ధంగా అధికారులు భూదాన భూముల లెక్కలను తగ్గించి చెప్పటం వెనుక కుట్ర ఉందనే అనుమానం కలుగుతుందన్నారు. 62 చిల్లర ఎకరాల స్థలాన్ని 31 ఎకరం వరకు కుదించి , ఇదే భూదాన భూమి మొత్తం అనడం భావ్యం కాదన్నారు. అసలు వెలుగుమట్ల లో అది కారులు పేర్కొంటున్న సర్వే నెంబర్లను అనుసరించి మొత్తం భూదాన భూమి ఎంత ఉందని , ప్రవేట్ భూమి ఎంత ఉంది ? ప్రభుత్వ భూమి ఎంత ఉంది ? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నే కాకుండా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా భూదాన భూమి ఎంత ఉంది ? ఎవరెవరి చేతులలో ఎంత భూమి ఉందో ?
ఎవరెవరు ఆక్రమించుకున్నారు ? ప్రభుత్వమే తన అవసరాలకు ఎంత ఉంచుకున్నది ? అనే అంశాలపై సమగ్ర వివరాల ను అందించేందుకు గాను శ్వేతా పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెల్లారుజానే అమానుషంగా ఇళ్లు కూల్చి వేత ఘటనలో మద్దతు ప్రకటించిన వారి పై , ప్రశ్నించిన వారి పై , పాత్రికేయుల పై కేసులు నమోదు చేయడం అన్యాయం , వెంటనే కేసులు చేయడంతో పాటు ఈ ఉదంతంలో అతి ఉత్సాహం చూపించిన పోలీసులపై
శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .








