పి ఆర్ పి ఏ జిల్లా కన్వీనర్ యలమద్ది వెంకటేశ్వర్లు వైవి
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
నాగులవంచ లో జరిగిన పి ఆర్ పి ఎ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వైవీ మాట్లాడుతూ 2024 మార్చి తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులు దాచుకున్న సొమ్మును వెంటనే విడుదల చేయాలని, ప్రతినెలా 700 కోట్ల రూపాయలు మంజూరు చేయటం సమస్యకు పరిష్కారం కాదని, ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు ( పెన్షనర్స్ కు) ఉద్యోగ సమయంలో దాచుకున్న డబ్బులను వెంటనే విడుదల చేసి, ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందేలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉద్యోగ విరమణ పొంది 22 నెలలు గడుస్తున్నప్పటికీ , గ్రాట్యువిటీ, కమ్ముటేషన్ , జిఐఎస్, లీవ్ ఎన్ క్యాష్మెంట్ ఇవ్వకపోవడం వల్ల, పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులతో తీవ్రంగా మనోవేదన చెందుతున్నారని వై వి తెలియజేశారు.తక్షణమే ఉద్యోగులు దాచుకున్న సొమ్మును వెంటనే విడుదల చేసి , పెన్షనర్స్ పడుతున్న ఆర్థిక బాధల నుంచి వెంటనే విముక్తి చెందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ సమావేశంలో జిల్లా కన్వీనర్ యలమద్ది వెంకటేశ్వర్లు వైవి, S. మధుసూదన్ రెడ్డి , జి చంద్రశేఖర్ , నంజాల పుల్లయ్య, అంబటి శాంతయ్య, డి .శివ నారాయణ రెడ్డి ఏం. బాబురావు, తాత రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు.








