+91 95819 05907

పేదోడి కడుపు కొడుతున్న మద్యం సిండికేట్

*ఎక్సైజ్ శాఖ ఎక్కడ?*
*మద్యం సిండికేట్ దందా విచ్చలవిడి…*
*పేదోడి కడుపు కొడుతున్న మద్యం సిండికేట్….*
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం:
బూర్గంపాడు మండల వ్యాప్తంగా బెల్ట్ షాపులు హద్దు అదుపు లేకుండా వెలుస్తున్నాయి.. మద్యం క్రయ విక్రయాలు చేస్తున్నారు.దీంతో ఉదయం నుంచి మొదలుకొని రాత్రి వరకు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతుండడంతో బెల్టుషాపులలో మద్యం ఏరులై పారుతోంది.బెల్ట్ షాప్ లో మద్యాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోకపోవడంతో, బెల్టుషాపు నిర్వాహకులకు హద్దు లేకుండా అధిక ధరలకు అముతూ మమ్మల్ని ఆపేది ఎవరు అంటూ ఎక్సైజ్ శాఖ వారికి సవావిసురుతున్నారు. కూలీ చేసి జీవనం సాగిస్తున్న పేదోడు కష్టాన్ని మద్యం సిండికేట్ నిర్వహకులు దోసుకుంటున్నారు. బూర్గంపాడు,సారపాక, లక్ష్మీపురం గ్రామంలో హద్దు అదుపు లేకుండా బెల్టు షాపులు నిర్వహణ కొనసాగుతుందంటే, ఎక్సైజ్‌ అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

బూర్గంపాడు, సారపాక గ్రామాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకున్న బెల్టుషాపులలు సమయపాలన లేకుండా, తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు మద్యం అమ్మటం వల్ల గొడవలకు కారణం అవుతున్నాయి..గ్రామాల్లోని కూలీ పనులు చేసుకునే నిరుపేదలు బెల్టుషాపులకు అలవాటుపడి కూలీ పనులకు సైతం పోకుండా, నిత్యం గ్రామాల్లో మద్యం మత్తులో ఉంటున్నారు.బూర్గుంపహాడ్,సారపాక లో ఉన్న వైన్ షాపుల నుంచి మద్యం కొనుగోలు చేసి, ఒక మద్యం బాటిల్‌పై ఎంఆర్‌పీ రేటు కంటే రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.గ్రామాల్లో మద్యం అమ్మకాలు సిండికేట్‌గా మారడంతో బెల్టుషాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. హోటళ్లు, కిరాణా షాపులు బెల్టు షాపులుగా తయారవుతున్నాయి. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు లాభార్జన ధ్యేయంగా గ్రామీణ ప్రాంతాల వారికి విక్రయిస్తున్నారు. మద్యం షాపులను రహదారుల పక్కన నిర్వహించరాదని అధికారికంగా వెళ్లడించినప్పటికి, గ్రామాల్లో రోడ్ల పక్కనే దర్జాగా మద్యం విక్రయిస్తున్నా, సంబంధిత ఎక్సైజ్‌ అధికారులు మామూళ్ల మత్తులో ఉండి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. బెల్ట్ షాపులు నిషేధించే శాఖ పని చేయనప్పుడు ఆ శాఖకు జీతాలు ఎందుకని సామాన్య ప్రజలు నిలదీస్తున్నారు. ప్రజలు ప్రభుత్వానికి చెల్లించే పన్ను రూపంలో నగదును ప్రభుత్వం..ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇస్తా ఉంటే ఎక్సైజ్ శాఖ ఎందుకు పనిచేయటం లేదని పలు ప్రజాసంఘాలు హెచ్చరిస్తున్నారు.

గ్రామాల్లో మద్యానికి బానిసైన కొందరు వ్యక్తులు అనారోగ్యం పాలవడంతో పాటు కుటుంబాలు అప్పుల కొరల్లో చిక్కుకోవడం,గొడవలు వంటి సంఘటనలు జరుగుతున్న గాని ఏమాత్రం బాధ్యత లేకుండా సంబంధించిన శాఖ వ్యవహరించటం హాస్య పదమని పలువురు ఆరోపిస్తున్నారు.
గ్రామాల్లో బెల్టు షాపులు నిర్వహించడం వలన మద్యానికి బానిసైన కుటుంబాలు అప్పుల పాలై రోడ్డున పడుతున్నాయి. చేసిన కష్టమంతా తాగుడికే దారపోస్తున్నారు. ముఖ్యంగా యువత మద్యానికి ఆకర్షితులవుతున్నారు. గ్రామాల్లో ఎక్కువగా ప్రజల మధ్య అల్లరులు, గొడవలు జరుగడానికి మద్యం కారణమవుతోంది. బెల్టుషాపుల నిర్వాహకులపై ఎక్సైజ్‌ అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయటం ఏమిటని మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మేము చావుకు భయపడే వాళ్లం కాదు.. చావుకు భయపడి లొంగిపోలేదు:మాజీ మావోయిస్టు అగ్రనేత ఆశన్న కీలక ప్రకటన

‘కొత్తదారి వెతుకులాటలో ఉన్నాం’.. మాజీ మావోయిస్టు అగ్రనేత ఆశన్న కీలక ప్రకటన దిశ, వరంగల్ బ్యూరో: ‘మేము చావుకు భయపడే వాళ్లం కాదు.. చావుకు భయపడి లొంగిపోయామని చేస్తున్న ప్రచారంలో నిజం లేదు.. ఇకనుంచి

Read More »

భూదాన భూ బాధితులకు కవిత పరామర్శ ● కూల్చి న స్థలంలోనే ఇల్లు కట్టించాలని , కలెక్టర్ రావాలని డిమాండ్

భూదాన భూ బాధితులకు కవిత పరామర్శ ఈ స్థలంలోనే ఇల్లు కట్టించాలని , కలెక్టర్ రావాలని డిమాండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట మూడు గంటల ధర్నా కవితతో పాటు విశారదన్ ను అదుపులో తీసుకున్న

Read More »

ఫుట్ బాల్ లో మల్లెమడుగు కు సిల్వర్ మెడల్

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : మున్సిపల్ కార్పొరేషన్ ( ఖమ్మం ) స్పోర్ట్స్ పార్క్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఖమ్మం జిల్లా స్థాయి ఉమెన్స్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్

Read More »

రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐలు

హైదరాబాద్ – ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఒక నిందితుడికి 41 నోటీసులు ఇచ్చేందుకు, ఫిర్యాదుదారుడి నుండి లక్ష రూపాయలు డిమాండ్ చేసిన బాబునాయక్, ప్రమోద్ అనే ఇద్దరు ఎస్ఐలు బాధితుడి ఫిర్యాదు

Read More »

అశ్వరావుపేటలో మట్టి మాఫియా ‘గ్రావెల్’ దందా: నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు!

​అనుమతులు లేవు.. అడ్డూఅదుపూ లేదు.. వినాయకపురం నుంచి యథేచ్ఛగా అక్రమ రవాణా! నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్ట్రర్: దాది చంటి) ​మార్చ్, 09: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో మట్టి మాఫియా

Read More »

 Don't Miss this News !