+91 95819 05907

ఒంటరి మహిళా పింఛన్ కొరకు బతికుండగానే భర్త లకు దూరంగా భార్యలు(అందరూ కాదు)?

★డబుల్ పింఛన్ల ఇష్యూ మరవక ముందే మరో మాయాజాలం బట్టబయలు
★ఒకరి తో సహజీవనం చేస్తూనే వితంతు పింఛన్లు పొందుతున్నారా?

★ఒంటరి మహిళ పింఛన్ కొరకు భర్తలకు దూరంగా?

★మంత్రి సీతక్క విచారణ చేపడితే నిజ నిజాలు బట్టబయలు

నేటి గదర్ న్యూస్,ములుగు ప్రతినిధి:

రెండు పెన్షన్లు పొందుతూ ప్రభుత్వ ఖజానా కు పలువురు పింఛన్ దారులు గండి కొట్టారు. ఉద్యోగ విరమణ లేదా భర్త /భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రిటైర్మెంట్ లేదా మృతి చెందిన ప్రభుత్వం ప్రతి నెల వేల రూపాయల పింఛన్ తీసుకుంటారు. వారు అనర్హులు ఐనప్పటికిని ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చే ఆసరా పింఛన్లు సైతం ప్రతి నెల తీసుకున్నారు.దీనితో ప్రభుత్వం పై అధిక భారం పడింది. ఆసరా పింఛన్లలో జరుగుతున్న అవినీతి పై ప్రభుత్వం దృష్టి సారించి విచారణ చేపట్టింది. సెర్ప్ తో విచారణ చేపట్టగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల మంది పై గా ఇలా పింఛన్ పొందారని బట్టబయలైంది. వారిలో కొంతమంది మృతిచెందగా… ఇంకా 1800 మందికి పైగా ప్రతినెల ఆసరా పెన్షన్ వారి ఖాతాలలో జమవుతున్నట్లు విచారణలో తేలింది. అక్రమ పద్ధతిలో ఆసరా పింఛన్ పొందిన వీరి నుండి రికవరికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం కాస్త సమయం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇది మరవక ముందే ఇదే ఆసరా పెన్షన్ లో మరో బాగోతంపై గుసగుసలు వినపడుతున్నాయి.

★ఒంటరి మహిళల పింఛన్ కోసం భర్తకు దూరంగా భార్యలు★

అవును ఇది కఠోర నిజం. మానవత్వం మరిచి కొంతమంది స్త్రీలు తమ భర్తలు బతికుండగానే… కేవలం ప్రభుత్వ అందించే ఆసరా పింఛన్ల కొరకు భర్త ల దూరంగా ఉంటున్నారు. మరికొందరు మహిళలు మరో పురుషుడితో సహజీవనం చేస్తూనే… చనిపోయిన మాజీ భర్త పేరు డెత్ సర్టిఫికెట్ తీసుకోని పింఛన్లు పొందుతున్నారు. మానవ బంధాల కంటే డబ్బుకు ఎంత ప్రాధాన్యత పెరిగిందో ఆసరా పింఛన్ల లో భర్తలు బతికుండగానే పింఛన్ పొందిన మహిళలను చూస్తే అర్థమవుతుంది. మంత్రి సీతక్క మరోమారు విచారణ చేయబడితే నిజా నిజాలు బయటకు వస్తాయి. బంధాలను మరిచి డబ్బు కు కక్కుర్తి పడుతున్న ఇలాంటి వారిపై విచారణ చేపట్టి రికవరీ చేయాలని పలువురు కోరుతున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !