నేటి గదర్ న్యూస్ , జులై 15 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సోమవారం కూసుమంచి మండలంలో మృతుల కుటుంబాలను పరామర్శించాడు.. కూసుమంచి మండలం ఈశ్వరమదారం మాజీ సర్పంచ్ సూర్యనారాయణ రెడ్డి తండ్రి రంగారెడ్డి ఇటీవల కన్నుమూశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకన్ గూడెం గ్రామ ఉపసర్పంచ్ కిన్నెర శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కూసుమంచి మండల అధ్యక్షు, కార్యదర్శులు వేముల వీరయ్య , ఆసిఫ్ పాషా, మాజీ సర్పంచ్ కాసాని సైదులు, సోషల్ మీడియా అధ్యక్షుడు వడ్త్యా బాలకృష్ణ,నాయకులు దాసరి వెంకన్న, పాడిశాల గోపి, పుల్లారెడ్డి, ఉపేందర్ గౌడ్, స్థానిక నాయకులు సర్పంచులు మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 741









