+91 95819 05907

మున్సిపల్ కార్మికుల ఏరియర్స్ ను చెల్లించాలి.

★ ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి.

నేటి గదర్ న్యూస్, మణుగూరు టౌన్:

మున్సిపల్ కార్మికుల ఏరియర్స్ ను చెల్లించాలని ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి మున్సిపల్ అధికారులను కోరారు. మంగళవారం మున్సిపల్ కార్మికుల ఏరియర్స్ విషయమై మున్సిపల్ కమిషనర్ గని కలిసి మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పి ఆర్ సి నివేదిక ప్రకారం అన్ స్కిల్డ్ కార్మికులకు 15,600 , సెమీస్కిల్డ్ కార్మికులకు 19,500, స్కిల్డ్ కార్మికులకు 22,750 రూపాయలు 2021 జూన్ నుండి అమలు కావలసి ఉండగా 2023 మే నుండి మణుగూరు మున్సిపల్ కార్మికులకు అమలు చేశారని అన్నారు. సుమారుగా రెండు సంవత్సరాల ఏరియర్స్ మున్సిపల్ కార్మికులకు రావాల్సి ఉందన్నారు. ఈ విషయం గురించి మున్సిపల్ కమిషనర్ గతో మాట్లాడగా నిధుల కొరత వలన గతంలో ప్రతినెల జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉండేదని, దానిని అధిగమించి కార్మికుల జీతాలు ప్రతినెల చెల్లిస్తున్నామని, ఏరియర్స్ కూడా నిధుల వెసులుబాటు చూసుకొని తప్పకుండా చెల్లిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం వీలైనంత త్వరగా ఏరియర్స్ చెల్లించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు మణుగూరు ఏరియా కార్యదర్శి బి. మల్సూర్, తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్, ఐ ఎఫ్ టి యు నాయకులు ఎం. రాజేందర్, పీ. లక్ష్మీనారాయణ, ఆర్. వెంకటేశ్వర్లు, పి. నరసింహారావు, త్రిమూర్తులు, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !