+91 95819 05907

BSNL: బిఎస్ఎన్ఎల్ పూర్వ వైభవం రానుందా..? ఆ రాష్ట్రంలో రెండు వారాల్లో లక్షకు పైగా కస్టమర్లు…

★నేటి గద్దర్ న్యూస్ ,ముదిగొండ మండల ప్రతినిధి బాబురావు

దేశంలో అన్ని ప్రధాన టెలికాం సంస్థలు టారిఫ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. జియోతో పాటు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు సైతం భారీగా ధరలను పెంచాయి.

పెరిగిన ఈ ధరలు జులై 4వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో మొబైల్ ఫోన్‌ యూజర్లపై భారీగా భారం పడుతోంది. ఈ క్రమంలో ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ కు కస్టమర్లు పెరుగుతున్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం దేశంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌ను BSNL మాత్రమే కలిగి ఉండేది. అయితే క్రమంగా కొత్త కంపెనీలు రావడంతో కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ను వదిలి ఇతర కంపెనీలకు వెళ్లిపోయారు. ఇటీవల టెలికాం సంస్థలు టారిఫ్ ప్లాన్‌లను పెంచడంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన గణాంకాలు విస్మయం కలిగిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో కేవలం రెండు వారాల్లో 1 లక్షా 15 వేల మంది కస్టమర్లు తమ సిమ్‌లను బీఎస్ఎన్ఎల్ కి పోర్ట్ చేసుకున్నారు.

భోపాల్‌లోనే రెండు వారాల్లో 30 వేల మంది కస్టమర్లు తమ నంబర్‌లను బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ చేశారు. తాజాగా దేశ వ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి ప్రతి రోజు డజన్ల కొద్దీ కస్టమర్లు వస్తున్నారు. ఓ జాతీయ మీడియా సంస్థ బృందం పలు రాష్ట్రాల్లో పరిస్థితిని గమనించింది. ఇతర కంపెనీల ప్లాన్‌లు ఖరీదైనవి కాబట్టి ఇప్పుడు మేము బీఎస్ఎన్ఎల్ కి మారుతున్నామని వినియోగదారులు మీడియా సంస్థతో తెలిపారు. భోపాల్ బీఎస్ఎన్ఎల్ పీజీఎం మహేంద్ర సింగ్ ధాకడ్‌ మాట్లాడుతూ.. మెరుగైన నెట్‌వర్క్‌ను అందించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. “కస్టమర్‌లు మళ్లీ బీఎస్ఎన్ఎల్ ను ఆదరిస్తున్నారు. ఇతర కంపెనీలు ఒక నెలకు వసూలు చేస్తున్న ప్లాన్‌ను మేము 3 నెలలకు అందిస్తున్నాము. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వచ్చిన తర్వాత కూడా సంస్థ మరింత బలపడుతోంది.” అని పేర్కొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !