నేటి గదర్ న్యూస్, హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ పిఏ తిరుపతి పై పలు ఆరోపణలు చేస్తూ పల్స్ ఆఫ్ తెలంగాణ అనే అకౌంట్లో ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు తన పదవిని అడ్డుపెట్టుకొని అనేక రకాల అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డట్లు ఆరోపించారు. మాజీ మంత్రి కేటీఆర్ పిఏ తిరుపతి ఎలా స్పందిస్తాడో వెయిట్ చేయాల్సిందే.
పల్స్ అఫ్ తెలంగాణ ట్వీట్
గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 దాక
బర్రెల నుంచి గొర్రెల దాక
దేన్నీ వదలని బండారి
మొదటి నుంచి వివాదాల్లోనే
కేటీఆర్ పీఏ తిరుపతిఫై సర్వత్రా చర్చ
అనామకుడిగా వచ్చి లెక్కకు మించిన ఆస్తులు కూడగట్టిన వైనం
చెప్పుల నుంచి చేతి వచ్చి వరకు అన్ని అబ్రాడ్ నుంచే
బియ్యం దిక్కులేని స్థాయి బిఎండబ్ల్యు కారు మెయింటైన్ చేసే స్థాయికి ఎదిగిన వైనం
అధికారంలో ఉన్నన్ని రోజులు మంత్రులు, ఎమ్మెల్యేలకే చుక్కలు చూపించిన ప్రబుద్ధుడు
తిరుపతి తీరుతో పీకల్లోతు కోపంలో పార్టీ వర్గాలు
గతంలో తిరుపతి వ్యవహార శైలిపై కేటీఆర్ ను హెచ్చరించిన కేసీఆర్
తాజా పరిణామాలతో కేటీఆర్ కు తలనొప్పులు
గొర్రెల స్కామ్ పై రాజన్నసిరిసిల్ల జిల్లాలో గతం లోనే బహిరంగంగా చర్చ
రాజుతో కలిసి దందా నడిపిన తీరు పై చర్చించుకున్న సొంత పార్టీ నేతలు
రాజన్నసిరిసిల్ల లోనే కాకుండా అనేక మంది ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొచ్చిన తిరుపతి
మీ నియోజక వర్గాల్లో గొర్రెల టెండర్ తన పార్టనర్ రాజుకి ఇవ్వాలని ఆదేశాలు
సొంత ఇల్లు దిక్కులేని రాజు ఇటీవల వేములవాడలో పెద్ద ఇల్లు మొదలు పెట్టిన వైనం
టోర్నమెంట్ లు, స్వచ్ఛంద సేవ పేరిట డబ్బులు వెదజల్లుతూ అందరి నోటా మంచి అనిపించుకునే ప్రయత్నం
ఏసీబీ అదుపులోకి తీసుకుంటే అన్ని విషయాలు బయటకొచ్చే అవకాశం…









