తాలిపేరు ప్రాజెక్ట్ లో భారీగా వరద నీరు…!
చర్ల నేటి గదర్ ప్రతినిధి,వరప్రసాద్ :చర్ల మండలం లోనీ తాలిపేరు ప్రాజెక్ట్ కు ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్ర లో కురుస్తున్న వర్షాల వలన భారీగా వరద నీరు వస్తుంది.దీనితో అప్రమత్తమైన అధికారులు గేట్లను ఎత్తారు.బుధవారం భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెలం వెంకట్రావు చే అధికారులు తాలిపేరు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎగువన ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో పడుతున్న వర్షాల వలన రానున్న రెండు మూడు రోజుల్లో ఈ వరద నీరు వలన గోదావరి మరింత పెరిగే అవకాశం ఉన్నందున స్థానిక అధికారులు అప్రమత్తం అయ్యారు.ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ 4 గేట్లు ఆధికారు లు పూర్తిగా ఎత్తి వేశారు.21 గేట్ల ను మాత్రం 2 అడుగుల మేర ఎత్తి నీరు,దిగువకి గోదావరి లోకి, విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు దిగువ ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు, చర్ల మండల అధికారులు సూచించారు.









