★మద్దిబోయిన సంతోష్ మరణం అత్యంత బాధాకరం , IFTU కార్మిక సంఘానికి తీరని లోటు
★మరణించిన కార్మికునీ కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
★మృతి చెందిన సంతోష్ ఉద్యోగాన్ని ఆయన కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాలి
★చర్ల మిషన్ భగీరథ సూపర్వైజర్ అధికారికి డిమాండ్స్ తో కూడిన వినతిపత్రం ఇవ్వడం జరిగింది
★తెలంగాణ ప్రగతిశీల మిషన్ భగీరథ కార్మిక సంఘం IFTU చర్ల మండల కమిటీ మరియు మిషన్ భగీరథ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్
నేటి గదర్ న్యూస్,చర్ల:
చర్ల మండలంలో R/w పంప్ హౌస్ వద్ద వాచ్మెన్ గా పనిచేసే మిషన్ భగీరథ కార్మికుడు మద్దిబోయిన సంతోష ఈరోజు మరణించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల మిషన్ భగీరథ వర్కర్స్ యూనియన్ IFTU , మిషన్ భగీరథ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చర్ల మండలం మిషన్ భగీరథ కార్మికులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా IFTU భద్రాచల0 ఏరియా నాయకుడు కొండ చరణ్ , మిషన్ భగీరథ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ భద్రాచలం డివిజన్ నాయకుడు మేడి సుందర్ మాట్లాడుతూ సంతోష్ మరణించడం ఎంతో బాధాకరమని ఆయన మరణం మిషన్ భగీరథ కార్మిక ఉద్యమానికి తీరని లోటు అని అన్నారు సంతోష్ అత్యంత స్నేహశీలు అని నిరంతరం అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవాడని అన్నారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ప్రభుత్వం మరణించిన మిషన్ భగీరథ కార్మికుడు కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేసియా ఇవ్వాలని అన్నారు మరణించిన కార్మికుని యొక్క ఉద్యోగాన్ని ఆ కార్మికుని కుటుంబం లో ఒకరికి ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు మిషన్ భగీరథ కార్మికులు ఐక్యంగా ఉండాలని సంతోష్ కుటుంబానికి అండగా నిలబడాలని అన్నారు అనంతరం సంతోష్ పార్థివ దేహాన్ని చూడడానికి వచ్చిన చర్ల సూపర్వైజర్ అధికారికి డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది అధికారి సానుకూలంగా స్పందించి వీలైనంత మేరకు సంతోష్ కుటుంబానికి న్యాయం చేసే దానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల మిషన్ భగీరథ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఎంఎల్ఎన్ రెడ్డి, వినయ్, రాజేష్, కిరణ్, మరియు నాగరాజు ప్రశాంత్ పవన్ వెంకట్ అరుణ్ బాబు ప్రశాంతు కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు









